వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన నీటి గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారికి ఇరువైపులా నీటి గుంతలు ఏర్పడ్డాయి.
దీంతో వాహనాలు వెళ్ళే సమయంలో అదుపుతప్పి పడిపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడు వరద నీరు పోయే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

