వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
గతేడాది వర్షాలకు దెబ్బతిని తాత్కాలికంగా మరమ్మతులు చేసిన ఉమ్మడి జిల్లా రహదారులు, వంతెనలు తాజా వర్షాలతో మళ్లీ దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ధర్పల్లి-సిరికొండ, కామారెడ్డి-ఎల్లారెడ్డి, బీబీపేట తదితర మార్గాల్లో రహదారులు, వంతెనలు ప్రమాదకరంగా మారాయి. శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...


