Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానంతో ప్రాణ దాతలుగా నిలుస్తున్నారు - ఎస్పీ

Follow Udayam on Google
రక్తదానంతో ప్రాణ దాతలుగా నిలుస్తున్నారు - ఎస్పీ - Udayam
విజయనగరలో తేరపంత్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ టెక్స్ టైల్స్ మార్కెట్ లో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం అవసరాలను గుర్తించి యువకులు రక్తాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అత్యవసర వైద్య సేవల సమయంలో యువకులు అందించిన రక్తంతో ప్రాణదాతలుగా నిలుస్తున్నారని కొనియాడారు.

Comments

G
Loading comments...