వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమిళనాడుకు తిరిగి వెళ్తున్న టాటా టియాగో కారు చిత్తూరు జిల్లా కాణిపాకం చిగరపల్లి వద్ద డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

