Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు

Follow Udayam Digital on Google
ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు - Udayam Digital
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. 2019లో నాగపట్ల చామల రేంజ్ పరిధిలో ఎర్రచందనం దుంగలతో దొరసామి ఎలుమలై పట్టుబడ్డాడు. అతడు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

Comments

G
Loading comments...