వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు.
2019లో నాగపట్ల చామల రేంజ్ పరిధిలో ఎర్రచందనం దుంగలతో దొరసామి ఎలుమలై పట్టుబడ్డాడు. అతడు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
Comments
Loading comments...
