Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రి గస్తీలో 409 కిలోల ఎర్రచందనం స్వాధీనం

Follow Udayam on Google
రాత్రి గస్తీలో 409 కిలోల ఎర్రచందనం స్వాధీనం - Udayam
టి.సుండుపల్లి మండలం సానిపాయ అటవీ రేంజ్‌లో రాత్రి గస్తీలో 13 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోటిగేవాండ్లపల్లె సమీపంలో మహీంద్రా స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేయగా 409 కిలోల ఎర్రచందనం పట్టుబడింది. స్వాధీనం చేసిన ఎర్రచందనం విలువ రూ.2,10,647గా అధికారులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని తోట వెంకటాద్రిని అరెస్టు చేశారు. సానిపాయ రేంజ్ అధికారి వై.సి.రెడ్డి వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...