వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు రూరల్ పరిధిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో మిరియాల జయరావు (33)కు మచిలీపట్నం పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2024లో పల్లెర్లమూడిలో ఈ ఘటన జరిగింది.
జయరావు జీవించి ఉన్నంతకాలం జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Loading comments...

