వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.సాయికుమార్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. NCD, ఫీవర్ సర్వే చేపట్టి, వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ఎదుగుదలను నివారించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

