వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి శ్రీధర్బాబు, దుద్దిళ్ల కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పదేపదే విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాటారం మండల కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ.. మండల ప్రజలు శ్రీధర్బాబుకు ప్రతిసారీ మెజారిటీ ఇస్తున్నారని తెలిపారు.
ప్రజలను అవమానించేలా మాట్లాడటం తగదని అన్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పుట్ట మధు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసారు.
Comments
Loading comments...

