వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు మారథాన్ పోటీల్లో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మారథాన్లో 19 ఏళ్ల సుధం కౌశిక్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో పూర్తి చేసి పతకం గెలుచుకున్నాడు.
కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుతున్న కౌశిక్ ఇప్పటివరకు 25 బహుమతులు సాధించాడు. భవిష్యత్తులో భారతదేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు.
Comments
Loading comments...

