వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామంలో అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం గణనాథుడికి అన్నపూజ నిర్వహించి భక్తులకు అన్నసత్రం ఏర్పాటు చేశారు.
గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని విద్యార్థులు కోరారు.
Comments
Loading comments...

