వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రత్యామ్నాయ పంటలను వేయడమే మేలు

ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు లాభం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏడిఏ కృష్ణ అన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం దండేపల్లి మండలంలోని నంబాల, వెలగనూరు గ్రామాలలో ఉన్న రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు జొన్న మొక్కజొన్న లాంటి పంటలను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అంజిత్ కుమార్, ఏఈవోలు రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...