Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి రైతుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలి

Follow Udayam on Google
Mohammad Sep 17, 2026 5:16 PM అనంతపురంGeneral
ప్రతి రైతుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలి - Udayam
పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 50,000 నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి నిర్మల పేర్కొన్నారు. గురువారం గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేశారని వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయాయని ఆమె పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు.

Comments

G
Loading comments...