Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి మొక్కను సంరక్షించాలి: కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 3:11 PM అమరావతిఆంధ్రప్రదేశ్
ప్రతి మొక్కను సంరక్షించాలి: కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి - Udayam
హరిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రింగ్‌ రోడ్డులోని పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. మన తప్పిదాల వల్లే పర్యావరణం దెబ్బతింటోందని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

Comments

G
Loading comments...