వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నిర్మల్ హృదయ్ స్కూల్ కరస్పాండెంట్, విద్యావేత్త వంగా సాంబశివారెడ్డి (80) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. 1978-79లో ఖమ్మంలో నిర్మల్ హృదయ్ పాఠశాలను ప్రారంభించి విద్యారంగానికి సేవలందించారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న ఆయన పలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. పలువురు రాజకీయ, విద్యా రంగ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Loading comments...

