Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకం వెంటనే చేపట్టాలి

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 7:03 PM నిజామాబాద్General
ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకం వెంటనే చేపట్టాలి - Udayam
ఐదు జిల్లాల్లో నిలిచిపోయిన ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 112 పాఠశాలల్లో 2,000 మందికి పైగా విద్యార్థులు చేరినా, మూడు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల నియామకం జరగలేదన్నారు. నియామకాలపై కొనసాగుతున్న యథాస్థితిని తొలగించేలా సీఎం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...