వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో గాయపడిన అటవీ సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఎర్రచందనం దుంగలు , వాహనం , ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న సిబ్బందిని అభినందించారు.
పరారీలో ఉన్న ముగ్గురిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
Comments
Loading comments...

