వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీపై డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నర్సాపూర్ (జి), మామడ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్పై బీజేపీ నాయకులు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...