వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల అభివృద్ధికి దాతల భాగస్వామ్యంతో 'బడి కోసం' పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, దాతలు రూ.1,000 నుంచి విరాళాలు అందించవచ్చు.
పాఠశాల అవసరాలను పోర్టల్లో చూసి నేరుగా విరాళాలు ఇవ్వొచ్చు. విరాళాల వినియోగ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని, దాతలకు మంత్రి నారా లోకేశ్ సంతకంతో ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
