వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక మరియు జైళ్ల శాఖల పోస్టుల భర్తీని అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా చేపడుతున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. నకిలీ అభ్యర్థులను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా ఆధార్ అథెంటికేషన్ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
అగ్నిమాపక, ఎస్పీఎఫ్ శాఖల్లో మొదటిసారిగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

