వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోయిని గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
విగ్రహ దాతగా ముందుకొచ్చిన టైగర్ రవీంద్రను నాయకులు అభినందించారు. ఐక్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

