వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు లోనై ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, ఒక సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
134 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం అనంతరం దిల్లీలో సురక్షితంగా దిగింది. ఘటనపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.
Comments
Loading comments...
