వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసా డివిజన్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో భైంసా మండలం వాడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తున్న ఆవుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో ఆవు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో సైతం ఉరుములతో కూడిన వర్షం కొనసాగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

