వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి ఆదివారం సాలూరలోని 100 పడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం, మందులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఒక్కో మంచంపై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్న పరిస్థితిని గమనించిన మంత్రి, తన తండ్రి స్వర్గీయ జన్నీ ముత్యాలు పేరు మీద 10 మంచాలు విరాళంగా అందిస్తానని ప్రకటించారు.
Comments
Loading comments...

