Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 4:43 PM చిత్తూరుGeneral
ఫీజు బకాయిలు విడుదల చేయాలి - Udayam
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చిత్తూరు నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రూ.6 వేల కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...