వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో PGRS సేవలపై ప్రజలు QR కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. జిల్లా, మండల PGRS కేంద్రాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్ను ఫిర్యాదు అనంతరం స్కాన్ చేసి స్పందన తెలియజేయవచ్చన్నారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో జరిగే PGRSలో అర్జీలు సమర్పించి, సేవలపై అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

