వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్నగర్ పెద్దవాగు బ్రిడ్జి సమీపంలోని రహదారి ప్రతి వర్షాకాలంలో అధ్వానంగా మారుతోంది. పెద్ద గుంతలు ఏర్పడి, ఇనుప చువ్వలు బయటకు వచ్చాయి. వర్షపు నీరు నిలవడంతో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ రహదారి కారణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

