వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేతనాల పెంపునకు సంబంధించిన జీవో 60ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
కార్మికులపై పని భారం పెంచే జీవో 51ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సూర్యవంశం రాము, మద్దిలేటి, అక్తర్ పాషా, అంజి, రాము పాల్గొన్నారు.
Comments
Loading comments...

