వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతానికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జలపాతం కొలనులోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
బొగతను సందర్శించే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, అటవీశాఖ అధికారులు సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Comments
Loading comments...

