వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రూ.87.53 కోట్లతో నిర్మించిన కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు అదనపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కోమటిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 4,235 ఎకరాలకు సాగునీరు అందనుందని, దీనికి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Loading comments...

