వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
మాడుగుల, చోడవరం, భీమునిపట్నం, అనంతగిరి, ఎస్.కోట, కొత్తవలస, అనకాపల్లి, విశాఖ పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

