Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీతాల కోతతో కార్మికులపై భారం: గండ్ర

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 5:50 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
జీతాల కోతతో కార్మికులపై భారం: గండ్ర - Udayam
భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 152 మంది కార్మికుల జీతాల కోతను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యతిరేకించారు. కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక్కో కార్మికుడి జీతంలో రూ.1,000 నుంచి రూ.4,900 వరకు కోత పడే అవకాశం ఉందని చెప్పారు. పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించాలని, జీతాల కోత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...