వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల్లో రెండోరోజు పవిత్రాల సమర్పణ వైభవంగా జరిగింది. యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి మూలవర్లు, ఉత్సవమూర్తులు, పరివార దేవతలకు పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం మలయప్పస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
Comments
Loading comments...

