వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నో బ్యాగ్ డే సందర్భంగా స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
రైతులతో మాట్లాడి పంటల సాగు, వ్యవసాయంలో ఎదురయ్యే కష్టనష్టాలను తెలుసుకున్నారు. ఎల్నినో ప్రభావం పంటలపై చూపే ప్రభావాన్ని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సల్ల పోశెట్టి వివరించారు. పర్యటనలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంఈఓ పి. సదానందం, ఇన్చార్జి హెచ్ఎం ఎ. నాగభూషణం అభినందించారు.
Comments
Loading comments...

