వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కృష్ణా జలాల వివాదం కేడబ్ల్యూడీటీ-2 పరిధిలో ఉన్నందున డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు వెల్లడించారు. జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

