వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవీతండా పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో నీళ్లు కట్టేందుకు వెళ్లిన బధావత్ చరణ్(18)పై పిడుగు పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన చరణ్ను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటీన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సర్పంచ్ గణేశ్ నాయక్ తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

