వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్మనపల్లి మండలం నేల మల్లేశ్వరస్వామి దేవస్థాన ఛైర్మన్గా రెడ్డిమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ, పార్టీకోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ టీడీపీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు.
రెడ్డిమోహన్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఆయన సేవలను గుర్తించి టీడీపీ ఈ పదవి కేటాయించిందన్నారు.
Comments
Loading comments...

