వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో ఆరుతడి పంటల సాగు లక్ష్యం చేరడం లేదు. వ్యవసాయ శాఖ 1.05 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 42,600 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వర్షాభావంతో రైతులు వరి, పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు.
కందులు, నువ్వులు, అలసందలు వంటి ఆరుతడి పంటలను మరో రెండు రోజుల్లో సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

