Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం

Follow Udayam on Google
p.g.murthy Sep 12, 2026 8:16 PM మంచిర్యాలGeneral
మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం - Udayam
మట్టి వినాయక విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందని జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామ జడ్పీ పాఠశాల హెచ్ఎం దుంపల తిరుపతి కోరారు. వినాయక చవితి సందర్భంగా శనివారం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలతో నీటితో పాటు పర్యావరణం కాలుష్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Comments

G
Loading comments...