వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం మల్లికార్జున నగర్ కాలనీలో టీం ఆదిదేవ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీం ఆదిదేవ్ అధ్యక్షుడు కిష్టారెడ్డి అతిథులను సత్కరించారు.
ఈ సందర్భంగా కిష్టారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు.
Comments
Loading comments...

