వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు.
రెవెన్యూ, పింఛన్లు, గృహాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

