Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలతో కుంకుమార్చన పూజలు

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 3:14 PM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల వద్ద మహిళలతో సామూహిక కుంకుమార్చన పూజలను వేద పండితులు చేయించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఫోన్ కాల్ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. దేశంతో పాటు తమ కుటుంబాలు బాగుండాలని వారు కోరుకున్నారు. అనంతరం భక్తులకు మండపాల నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...