వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఆషాఢ శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ జువ్వాడి నర్సింగరావు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

