వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గు గనుల కేటాయింపుల కేసులో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్కు విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ ఇచ్చిన క్లీన్ చిట్ నివేదికను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆమోదించింది.
మన్మోహన్ మరణానంతరం ఈ కేసు అప్పీల్ సాంకేతికంగా ముగిసిందని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. దీంతో మాజీ ప్రధానిపై ఉన్న క్రిమినల్ కేసు ముగిసినట్లయింది.
Comments
Loading comments...
