వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం అడిగాం (బి) గ్రామ భక్తులు మంగళవారం సిరిచెల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి కావడి యాత్ర చేపట్టారు. గ్రామంలో కావడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శివనామస్మరణల మధ్య యాత్ర ప్రారంభించారు.
ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి పాలాభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. యాత్రలో గ్రామ భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

