వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు గ్రామసభ నిర్వహించారు. సర్పంచి లకావత్ జిమ్మీలాల్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్లాంట్ ఏర్పాటు, ఆవశ్యకతపై చర్చించారు.
నీటి కాలుష్య నివారణపై కూడా చర్చించారు. కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ ప్రోగ్రాం మేనేజర్ మధుసూదన్రెడ్డి, బాలవికాస కోఆర్డినేటర్ మోహన్రెడ్డి, విమల్, రాజ్కుమార్, వినయ్, శంకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

