వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 729 మంది విద్యార్థినులు వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కుంటలో నిర్మించిన భవనం చుట్టూ వర్షపు, మురుగు నీరు చేరుతోంది. తరగతి గదులు, ప్రహరీ, శుద్ధి నీటి సదుపాయాలు లేవు.
గదుల కొరతతో ప్రయోగశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రహరీ లేక ఆకతాయిల బెడద, పాములు, దోమలు, కోతుల సమస్యలు ఉన్నాయని కళాశాల వర్గాలు తెలిపాయి. ఇటీవల రూ.11 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి.
Comments
Loading comments...

