వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో పాత కలెక్టరేట్ లో కేవలం మూడు తరగతి గదులతోనే నాలుగు బ్యాచ్లకు క్లాసులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
నూతన భవన పనుల కోసం నిధుల కొరత వేధిస్తుండటంతో హాస్టళ్లు, ల్యాబ్ల ఏర్పాటు నిలిచిపోయింది. పెండింగ్ నిధులు మంజూరు చేసి, సెప్టెంబరులోగా పనులు పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

