వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని ఫిరంగిపురం రామాలయం వద్ద ఆర్యవైశ్య భక్తుల ఆధ్వర్యంలో ఆదివారం 10 వేల మోదక హోమ సమర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై మోదకాలను హోమంలో సమర్పించారు. హోమ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో రామాలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
Comments
Loading comments...

