వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో కొత్తగా పింఛన్ పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు కర్నూలు కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. తొలుత గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, అర్హులెవరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని అర్హులైన దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

